సౌత్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ముచ్చటగా మూడోసారి బ్రేకప్ చెప్పేసిందా ? అంటు అవును అనే వార్తలే కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. నయనతార కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. నయనతార కెరీర్ స్టార్టింగ్లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడిన నయన శింబును పెళ్లి చేసుకుంటుందన్న వార్తల వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి చేసిన వల్లభ సినిమాలో లిప్లాక్లు అప్పట్లో హైలెట్.
ఆ తర్వాత ఏమైందో ఏమోగాని సడెన్గా ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత నయన తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో ఆమెకు వరుస పెట్టి ఆపర్ల మీద ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పలు సినిమా వేడుకల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నయన్ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రమలతకు కూడా విడాకులు ఇచ్చాడు.
శ్రీరామరాజ్యం తర్వాత తాను కెరీర్కు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పింది కూడా. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయి నేను రౌడీనే సినిమా షూటింగ్ టైంలో ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. విఘ్నేష్ నయన్ కంటే చిన్నవాడు కూడా. వీరిద్దరు ప్రేమ పెళ్లి వరకు వెళతారు అనుకుంటోన్న టైంలో ఇప్పుడు వీరిద్దరు విడిపోయారన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలు జోరుగా వస్తున్నా వీరిద్దరు మాత్రం స్పందించడం లేదు.
దీంతో నయనతార ఈ సారి నిజంగానే బ్రేకప్ చెప్పేసిందన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గాని ఈ పుకార్లకు చెక్ పడే పరిస్థితి లేదు. మరి నయన్ మూడో ప్రేమలో అయినా సక్సెస్ అవుతుందో ? లేదో ? అన్నది కాలమే ఆన్సర్ చేయాలి.