టాలీవుడ్ లో ఆచార్య సినిమా గురించి ఇప్పుడు చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది అర్ధం కావడం లేదు. ఈ సినిమాలో నటించడానికి చాలా మంది హీరోయిన్స్ పేర్లను దర్శక నిర్మాతలు పరిశీలించినా సరే ఎవరూ కూడా అంత ఆసక్తి చూపించి సినిమాను చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో త్రిష తర్వాత కజాల్ ని ఎంపిక చేసారు అనే ప్రచారం జరిగింది. ఆమె కూడా కాదని మరొకరు అని అంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ని ఎంపిక చేసారు అని సమాచారం. 

 

విద్యా బాలన్ ని ఇప్పటికే అడిగారు అని ఆమె అందుకు ఓకే చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించి మెప్పించారు. ఆ సినిమాలో బసవ తారకం పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆమెను తీసుకునే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఆచార్య సినిమాలో హీరోయిన్ గురించి చాలా చర్చలే జరుగుతున్నాయి. ఈ సినిమాలో విద్యా బాలన్ నటించడం దాదాపుగా ఖరారు అయింది అని అంటున్నారు. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తారు. ప్రస్తుత౦ కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసింది అని అంటున్నారు. దీని పై త్వరలో ఒక అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథ లో కొన్ని మార్పులను చేయడం తో పాటుగా కీలక నటులకు సంబంధించిన పాత్రలను ఎంపిక చేస్తున్నారని సమాచారం. మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: