బాలయ్య బాబు సినిమాలు అనగానే జనాలకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. చిన్న చిన్న దర్శకులు కూడా ఆయన తో సినిమా చేయడానికి ముందు నుంచి ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ కూడా వారి తో సినిమా చేయడానికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వస్తు ఉంటారు అనేది వాస్తవ౦. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన అఘోరా పాత్రలో నటిస్తున్నారు అని టాలీవుడ్ జనం అంటున్నారు. ఇటీవల దీని మీద వార్తలు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఖాళీ గానే ఉన్నారు. 

 

లాక్ డౌన్ కారణంగా ఆయన తర్వాతి సినిమాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేసిన బాబీ తో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఒక కథ ఉందని బాబీ చెప్పాడని బాలకృష్ణ ఇంటికి రమ్మని చెప్పారని ఆ కథ విన్నారు అని వెంటనే ఆ కథను ఓకే చేసారు అని సమాచారం. ఈ సినిమాలో నిర్మాత ఎవరు అనేది స్పష్టంగా తెలియదు గాని వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. టాలీవుడ్ లో బాలకృష్ణ కు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. 

 

అయితే ఈ సినిమాను బాలకృష్ణ బంధువు ఒక నిర్మించడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం. ఆయన కథ విన్నారు అని ఆయన నిర్మిస్తాను అని చెప్పారని అంటున్నారు. ఈ కథలో బాలకృష్ణ రెండు మూడు మార్పులు చెప్పగా దానికి ఓకే కూడా చెప్పాడు అని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మీద బాబీ తన అధికారిక సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: