టాలీవుడ్ స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగేసింది. త‌న ప్రియుడు విరాట్ కోహ్లీతో ఆమె ఏళ్ల పాటు ప్రేమాయ‌ణం న‌డిపేసి చివ‌ర‌కు విరాట్‌ను పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక అనుష్క మ‌ళ్లీ బిజీ కాబోతుంద‌ట‌. ఆమె చివ‌రి సారిగా 2018లో పారి, సంజు, జీరో సినిమాల్లో న‌టించింది. గ‌తేడాది పూర్తిగా సినిమాకు దూర‌మైంది. ఇక ఇప్పుడు ఆమె తిరిగి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ స‌రి కొత్త పాత్ర‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. 

 

బాలీవుడ్ సంగ‌తి ఎలా ఉన్నా ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోందంటే పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్‌గా కాదు.... నిర్మాత‌గా..! తెలుగు ప్రేక్ష‌కులు అభిరుచికి అనుగుణంగా ఆమె ఇక్క‌డ కొన్ని సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకుంటోంద‌ట‌. వాస్త‌వానికి ఆమె తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేదే. అయితే ఆ ఛాన్స్ అనుకోకుండా మిస్ అయ్యింది. గోపీచంద్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శౌర్యం సినిమాలో ఆమె హీరో గోపీ చెల్లి పూన‌మ్ కౌర్ పాత్ర‌ను అనుష్క చేయాల్సి ఉంది. ఆ సినిమాలో అనుష్క ఆ రోల్ చేసి ఉంటే ఆ త‌ర్వాత ఆమె మ‌రిన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసేదే.

 

అయితే అదే స‌మ‌యంలో ఆమెకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ స‌ర‌స‌న ఛాన్స్ రావ‌డంతో అది వ‌దులుకుంది. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఆమె టాలీవుడ్‌లో ప్రొడ్యుస‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. ఇక్క‌డ మిడిల్ రేంజ్ హీరోల‌తో పాన్ ఇండియా టైప్ సినిమాలు ప్లాన్ చేసే యోచ‌న‌లో అనుష్క ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే తన నిర్మాణ సంస్థ పై ఓ పచార చిత్రంలో భర్త కోహ్లీని వాడినట్లు సమాచారం. మ‌రి బిజినెస్ వుమెన్‌గా అనుష్క ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: