టాలీవుడ్ లో రాజమౌళి అంటే ఒక క్రేజ్... ఆయన సినిమా అనగానే ఒక పిచ్చి ఉంటుంది ప్రేక్షకులకు. హీరోకి మించి ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏ సినిమా చేసినా సరే అదే విధంగా తన రేంజ్ ని చూపించే విధంగా చేస్తూ ఉంటారు. మొదటి సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంతే. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ ని కూడా ఆయన పట్టించుకోవడం లేదు అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఏ ద‌ర్శ‌కుడు చేయ‌ని విధంగా ఇప్పుడు ఉన్న జ‌న‌రేష‌న్లో ఇద్ద‌రు స్టార్ హీరోలు అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను క‌లిపి మ‌రీ సినిమా చేస్తున్నాడు.

 

ఈ తరుణంలో ఆయన హీరోలను బాగా ఇబ్బంది పెడుతున్నారట. డబ్బింగ్ లో తనకు కావాల్సిన ఎమోషన్ వచ్చే వరకు వాళ్ళను వదిలిపెట్టడం లేదట. చివరికి ఒక చిన్న పిల్లాడి డబ్బింగ్ ని కూడా ఆయన దాదాపు మూడు రోజుల సమయం తీసుకుని వంద టేక్ లు తీసుకుని చేయించారు అని సమాచారం. అదే విధంగా హీరోయిన్స్ డబ్బింగ్ విషయంలో ఏ చిన్న ఇబ్బంది రావొద్దని పట్టుదలగా ఉన్నారట  జక్కన్న. 

 

సినిమా ఎడిటింగ్ లో కూడా ఆయన అదే విధంగా ఉన్నారట. సీన్ ని అడ్జస్ట్ చేద్దాం అని చెప్పినా సరే వద్దు అవసరం అయితే రీ షూట్ చేద్దాం అని చెప్పారట. దీనితో హీరోలు కూడా ఇప్పుడు జక్కన్న పట్టుదల చూసి షాక్ అవుతున్నారట. మరీ ఇలా ఉంటాడా అంటూ ఎన్టీఆర్ షాక్ అయిన సందర్భం కూడా ఉందట. ఇక ఆయనను చూసిన అక్కడ వర్క్ చేసే వాళ్ళు మరీ ఇంత రాడ్డు ఏంటీ గురు అని అంటున్నారట. ఇక రాజ‌మౌళి టేకింగ్ .. ప‌ర్‌ఫెక్ష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదుగా..?

మరింత సమాచారం తెలుసుకోండి: