స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, బన్నీ లేని కొన్ని సీన్స్ చిత్రకరణ చేశారు. అయితే ఈ లోగా కరోనా కారణంగా లాక్‌ డౌన్ ప్రకటించటంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్‌ లో సినిమా కు సంబంధించి మరింత ఫైన్‌ ట్యూన్ చేస్తున్నారు.

 

అందులో భాగంగా సినిమా లో అల్లు అర్జున్‌ వేసుకోబోయే కాస్ట్యూమ్స్‌ ను రెండు రోజుల పాటు కాఫీ లో నానబెట్టి తరువాత ఉతికి  సిద్ధం చేస్తున్నారట. ఓల్డ్‌ లుక్‌ లో కనిపించటం కోసం ఇలా చేస్తున్నారట. ఈ సినిమా లో బన్నీ జోడిగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తుంది.

 

మరో కీలక పాత్రలో కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడన్న టాక్ వినిపించినా ప్రస్తుతం డేట్ల సమస్య రావటంతో విజయ్ తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌ లో ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది.

 

ఈ సంవత్సరం జనవరి లో అల వైకుంఠపురములో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు ఇండస్ట్రీ హిట్‌ ను సాధించాడు బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బన్నీ కెరీర్‌ బెస్ట్ సినిమాగా నిలిచింది. అదే జోరులో తదుపరి సినిమా ను కూడా ప్రారంభించాడు.  ఈ సినిమాలో బన్నీ పక్కా మాస్ లుక్‌ లో అలరించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: