తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకే కాదు దర్శక, నిర్మాతలకు మంచి క్రేజ్ ఉంది. పలానా నిర్మాత, పలానా హీరోతో సినిమా చేస్తే బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కూడా అంచనాలు వేస్తూ ఉంటారు. అలాంటి క్రేజ్ ఉన్న నిర్మాత దిల్ రాజు. అయన తన కెరీర్లో ఎన్నో విజయాలను సొంత చేసుకున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు మంచి కథలతో క్రేజీ కామ్భినేషన్ తో మంచి హిట్స్  అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఆయన ప్రభాస్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

తెలుగు ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాల నిర్మాతగా మంచి పేరు ఉన్న నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయ్యేలోగా మరొక సినిమా ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గతంలో కూడా ప్రభాస్, దిల్ రాజు కాంభినేషన్ లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రభాస్ కూడా మంచి కథతో వస్తే సినిమా చేయటానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. 

 

దీని తో దిల్ రాజు మంచి కథలను వెతికే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీ రాం, దిల్ రాజుకి ఒక లైన్ వినిపించాడట. అది దిల్ రాజుకి నచ్చటంతో స్క్రిప్ట్ రెడీ చేయమని వేణు శ్రీ రాం కి చెప్పినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ఆ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట వేణు. ఇక లాక్ డౌన్ తర్వాత ప్రభాస్ కి కథ వినిపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాదా కృష్ణ దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. తర్వాత నాగ అశ్విన్ తో ఒక సినిమా ఓకె చేసాడు. ఈ రెండు సినిమాల తర్వాత దిల్ రాజు సినిమా లైన్లో పెట్టాలని చూస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: