ఇప్పుడు మన తెలుగులో హీరోలు పైకి చెప్పలేని విధంగా కష్టాలు పడుతున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఒక్క సినిమా వచ్చినా చాలు అనేది టాలీవుడ్ జనాల మాట గా చెప్పుకోవచ్చు. ఒక్క సినిమా కూడా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఇక హీరోలు కూడా ఇప్పుడు సినిమాల కోసం చాలా వరకు నానా కష్టాలు పడుతున్నారు అనేది అర్ధమవుతుంది. అగ్ర దర్శకుల తో సినిమాలు చేస్తున్న హీరోలు అయితే ఇప్పుడు ఒత్తిడి తట్టుకోలేక నానా ఇబ్బందులు కూడా పడుతున్నారు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి ఆ సినిమాలు మొదలు కాకపోయినా సరే నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేసారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకు గానూ పవన్ కళ్యాణ్ కి భారీగా ఇచ్చుకున్నారు అని తెలుస్తుంది. ఆయన కోసం ఇప్పటికే క్రిష్ డేట్స్ కూడా తీసుకున్నారు. కాని సినిమా మాత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం అనేది టాలీవుడ్ జనాల మాట. ఇప్పుడు ఈ సినిమాలు ఆలస్యం అయితే మరో సినిమాకు తీసుకున్న అడ్వాన్సు ఇచ్చిన నిర్మాతలు కూడా ఇబ్బంది పడతారు. 

 

వారి నుంచి కూడా భారీగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు హీరోలు నానా కష్టాలు పడుతున్నారు. ఎం చెయ్యాలో అర్ధం కాక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చిరంజీవి కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. ఈ విధంగా టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు అందరూ కూడా సినిమాల విషయం లో భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని భయపడుతున్నారు అని అంటున్నారు. మహేష్ సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: