టాలీవుడ్ లో స్టయిలిష్  స్టార్ అల్లు అర్జున్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. గంగోత్రి సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తర్వాత నుండి తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలోని డ్యాన్స్ లతో అభిమానులను ఫిదా చేశాడు. సినిమా సినిమాకి విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు.

 

అల్లు అర్జున్ అంటే ఇండస్ట్రీలో టాప్ రేటింగ్ స్టార్ అని ముద్ర వేసుకున్నాడు. అయితే అంత క్రేజ్ ఉన్న బన్ని తన కెరీర్ లో మాస్ ఇమేజ్ కారణంగా రెండు హిట్ సినిమాలను వదులుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం సినిమాని వాస్తవంగా అల్లు అర్జున్ చేయాలి. అప్పటికే బోయపాటి దర్శకత్వంలో  వచ్చిన సరైనోడు సినిమాకి వచ్చిన మాస్ ఇమేజ్ దెబ్బతింటుందేమో నని గీత గోవిందం సినిమాకు నో చెప్పాడట బన్నీ.

 

కాని తర్వాత ఈ సినిమా నేనే చేసి ఉంటే బాగుండేది అని సన్నిహితుల దగ్గర ఫీల్ అయ్యారని సినీ వర్గాల సమాచారం. అయితే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత ఈ కథ చెప్పి ఉంటే తప్పకుండా అర్జునే ఈ సినిమా చేసి ఉండేవారు. అన్నట్టు ఈ మధ్య 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న భద్ర సినిమా కూడా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమానే. అయితే అప్పటికి మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల బన్ని ఈ సినిమాను వద్దని చెప్పారని ఇండస్ట్రీ టాక్. మొత్తంగా అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ కారణంగా రెండు హిట్ సినిమాలు చేజారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: