కరోనా వైరస్ కారణంతో సినిమా షూటింగ్ లు అన్నీ కూడా మూతపడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ఎప్పుడు బిజీ షెడ్యూల్ లో ఉండే సెలబ్రిటీల అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో కొందరు సెలబ్రెటీలు వర్కౌట్స్, ఇంటిని శుభ్రపరచడం, మరి కొన్ని తారలు అయితే వారు ఎన్నడూ చేయలేని పనులు చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. అలాగే "బి ద రియల్ మ్యాన్ " చాలెంజ్ తో కూడా సినీ తారలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My clan is retiring for the night ❤️❤️good nite people 🌟🌟#lockdownlife #staysafe

A post shared by namrata Shirodkar (@namratashirodkar) on


ఇకపోతే ఈ తరుణంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన సమయాన్ని మొత్తం ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కు ఏ కాస్త సమయం దొరికినా కూడా కుటుంబ సభ్యులతో జాలీగా గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక సంక్రాంతికి విడుదలైన " సరిలేరు నీకెవ్వరు " సినిమా అనంతరం మహేష్సినిమా కూడా మొదలు అవ్వలేదు. దీనితో మహేష్ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తున్నారు. 

 


ఇక క్వారంటైన్ తరుణంలోనే ఇటీవల కొడుకు గౌతమ్ తో గేమ్స్ ఆడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి టైం పాస్ చేస్తున్నాడు మహేష్ . ఇక తాజాగా నమ్రత మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో మహేష్, గౌతమ్, సితార కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో అచ్చం గౌతమ్ కు అన్నా ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా ఉన్నాడు మహేష్ బాబు. అమృత చేసిన పోస్ట్ కు కూడా గౌతమ్ కు అన్నయ్య లాగా ఉన్నావు అంటూ కామెంట్లో పెట్టారు అభిమానులు. అయితే ఈ క్వారంటైన్ సమయం కొందరికి సరదాగా కొందరికి ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: