టాలీవుడ్ లో ఇప్పుడు రానా పెళ్లి గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. రానా పెళ్లి గురించి ఎప్పుడూ ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది ఇక గత నాలుగైదేళ్లుగా వస్తోన్న తన పెళ్లిపై వస్తోన్న రూమర్లకు చెక్ పెడుతూ తన ప్రియురాలు అయిన మహీకా బజాజ్తో ప్రేమలో ఉన్నానని.. ఆమె తన ప్రేమను అంగీకరించిందని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ జంట ప్రేమను రెండు వైపులా కుటుంబాలకు కూడా ఆశీర్వదించేశాయి. దీంతో రానా ఎప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా ? అని వెయిట్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది.
ఇప్పుడు రానా పెళ్లి ఫైనల్ అవ్వడంతో అతను ఎక్కడ చేసుకుంటాడు ఏంటీ అనే దాని మీద అనేక చర్చలు ఉన్నాయి. ఇక ఎవరిని పెళ్ళికి పిలుస్తాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పుకోవచ్చు. అయితే మీడియా కు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు అతను ఎవరిని పిలుస్తాడు అంటే... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, సిఎం వైఎస్ జగన్ కుటుంబాన్ని, అలాగే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్, అలాగే ఢిల్లీ కి చెందిన ఒక వ్యాపారవేత్త తో పాటుగా కొందరు అతని స్నేహితులను పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.
ముందు అక్కినేని కుటుంబం పెళ్లి జరిగే హిమాచల్ ప్రదేశ్కు వెళ్తుందని వాళ్ళు అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చూస్తారని, వెంకటేష్ తో పాటుగా నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వెళ్ళే అవకాశం ఉందని టాక్..? ఇక తెలంగాణ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి, అలాగే తెలంగాణా కు చెందిన ఒక ఎంపీకి ఆహ్వానం ఇచ్చే సూచనలు ఉన్నాయని వీళ్ళ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పెళ్లి గురించి ఏ మ్యాటర్ అయినా హాట్ టాపిక్ అవుతోంది.