టాలీవుడ్ లో విజయశాంతి సినిమాలు ఇప్పుడు చేయకపోయినా సరే ఆమె గురించి ఏదోక వార్త మాత్రం వస్తూనే ఉంటుంది. ఆమె సినిమాలు ఇప్పుడు లేకపోయినా ఆ సినిమా చేస్తున్నారు ఈ సినిమా చేస్తున్నారు అంటూ ఏదోక కథనం వినపడుతూనే ఉంటుంది. యేళ్ల‌కు యేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న విజ‌య‌శాంతి ఈ సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో సూప‌ర్ ‌డూప‌ర్ హిట్ కొట్టారు. ఓ మంచి సినిమా అది కూడా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాతో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేష‌మే.

 

అయితే ఇప్పుడు విజయ శాంతి దర్శకురాలి గా మారే ప్రయత్నంలో ఉన్నారని ఒక చిన్నారి జీవిత కథ ఆధారంగా ఆమె సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె కథను ఇప్పటికే సిద్దం చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ కథను ఆమె సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మరి ఆమె ఏ సినిమా చేస్తారు అనేది తెలియదు గాని ఈ సినిమాకు నిర్మాత కూడా ఆమె అని సమాచారం. ఆమె ఇప్పటికే కథను ఒక చిన్న హీరోకి కూడా చెప్పేశారు అని, ఆ సినిమాలో అతను కూడా న‌టిస్తాడు అని అంటున్నారు. 

 

ఆ సినిమాలో పాప తల్లిగా ఒక మాజీ హీరోయిన్ నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంది. విజ‌య‌శాంతి ఈ పాత్ర కోసం ఆమెను ఒప్పించార‌ని టాక్‌. ఏదేమైనా సరే విజ‌య‌శాంతి చాలా రోజుల త‌ర్వాత ద‌ర్శ‌కురాలిగా మారుతోన్న‌ ఈ వార్త నిజమే అని అంటున్నారు. ఆమెకు దర్శకురాలి గా మారాలి అనే కోరిక ఎప్పటి నుంచో ఉందని... అందుకే ఆమె ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అని చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: