టాలీవుడ్ లో చార్మీ, పూరి జగన్నాథ్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇద్దరూ దాదాపు ఆరేళ్ళు గా కలిసి సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమా చేసినా సరే కష్టపడి చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జ్యోతి ల‌క్ష్మి సినిమా తీసిన‌ప్ప‌టి నుంచి పూరి - ఛార్మీ స్నేహం ఎంత‌లా పెన వేసుకు పోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇదే టైంలో వీరిద్ద‌రు అనేక వివాదాల్లో కూరుకు పోయారు. ఇక ఏ క‌ష్టం వ‌చ్చినా.. సుఖం అయినా కూడా ఆమె పూరికి అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆమె పూరి తో విడిపోయే అవకాశం ఉందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.



త్వరలోనే ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పంజాబ్ లోని అమృత్ సర్ కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ... ఆమె అక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఛార్మీ వ‌య‌స్సు ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసింది. దీంతో ఆమెకు కుటుంబం నుంచి బాగా ఒత్తిడి వస్తుందని అందుకే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆమె మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనేది చూడాలి.



ప్రస్తుతం పూరి చార్మీ కలిసి విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఫైట‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమా తర్వాత పూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని లేదా చిరంజీవి తో చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి ఏ సినిమా చేస్తాడు అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: