మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటించిన ధృవ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కోలీవుడ్ హిట్ మూవీ త‌నీ ఒరువ‌న్ సినిమాకు రీమేక్ గా వ‌చ్చిన ఈ సినిమా తెలుగులో ధృవ గా మంచి హిట్ కొట్టింది. ఆ సినిమాలో ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో విల‌న్ గా న‌టించిన అర‌వింద్ స్వామినే తీసుకు వ‌చ్చి ఇక్క‌డ కూడా విల‌న్ గా న‌టింప జేశారు. ధృవ సినిమా తో తాను ఏంటీ అనేది అరవింద స్వామి చూపించారు. ఆయన సినిమాలకు తమిళంలో  మలయాళంలో ఏ స్థాయిలో ఆదరణ వచ్చిందో... ఆ సినిమా తర్వాతి నుంచి తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ అనేది వచ్చింది.



ఈ సినిమాలో అతని నటన చూసిన విమర్శకులు కూడా అతను లేకపోతే సినిమానే లేదు అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే అర‌వింద్ స్వామి విశ్వ‌రూపం చూపించాడు. ఇక ఇప్పుడు అతను ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. కాని కాదని మహేష్ సినిమాలో నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అతను ఒక మంత్రిగా నటించే అవకాశం ఉందని సమాచారం.



సర్కార్ వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అతను మంత్రిగా నటిస్తాడు అని టాలీవుడ్ లో టాక్. ఆ సినిమా కోసం అతను దాదాపు పది కోట్లు డిమాండ్ చేసాడు అని, ఆ పాత్రకు అతను అయితేనే బాగుంటుంది అని ఓకే చేసారట. ఆ సినిమా కథ లో కొన్ని మార్పులు ఉండటం తో మహేష్ బాబు సూచనలు చేసాడట. మహేష్ బాబు కోరిక మేరకు కథను దర్శకుడు మారుస్తున్నాడని... అటు నిర్మాత కూడా మార్పులు అడిగాడు అని సమాచారం. అందుకే ఇప్పుడు కథ ను మారుస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు... రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: