కరోనా కారణంగా లాక్ డౌన్ విధించటంతో సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట్లో ఈ సమయాన్ని హాలీడేస్గా భావించినా రాను రాను అంతా ఖాళీగా ఇంట్లోనే ఉండటంపై బోర్ ఫీలవుతున్నారు. దీంతో ఒక్కొక్కరు తమ చిరాకును ఒక్కోరకంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే హీరోల విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది.
తాజాగా తన వర్క్ అవుట్ వీడియోను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన టైగర్ ష్రాఫ్ బయటకు వెళ్లి ఆడుకోవడానికి చాలా మిస్ అవుతున్నా అంటూ కామెంట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే లాక్ డౌన్కు ముందుకు భాగీ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టైగర్ ష్రాప్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే లాక్ డౌన్ రావటంతో సినిమాకు సక్సెస్ టాక్ వచ్చినా భారీగా కలెక్షన్లు రాలేదు. దీంతో లాక్ డౌన్ త్వరగా తీసేస్తే సినిమాను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.