టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎటు నుంచి ఎటు చూసిన సరే ఇప్పుడు రష్మిక మంధన లేదా పూజ హెగ్డే మాత్రమే కనపడుతున్నారు. వాళ్లకు మాత్రం స్టార్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త హీరోయిన్ లను పరిశీలించే అవకాశం కూడా దాదాపుగా కనపడటం లేదు అని చెప్పవచ్చు. స్టార్ హీరోల పక్కన వాళ్ళు మినహా మరో ఆప్షన్ ఇప్పుడు కనపడటం లేదు అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

 

అది ఏంటీ అంటే స్టార్ హీరోల పక్కన కొందరు హీరోయిన్ లను ట్రై చేయడం మంచిది అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. నభా నటేష్ కి మహేష్ సినిమాలో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో సర్కారు వారి పాట నిర్మాతలు ఉన్నారు. ఆమె అయితే సినిమాను తక్కువకి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెను సినిమాలోకి తీసుకుంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి మహేష్ నుంచి కూడా స్పందన వచ్చింది అని సమాచారం. ఆయన కూడా అందుకు ఓకే చెప్పాడు అని అంటున్నారు. 

 

ఇక ఎన్టీఆర్ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ ని ట్రై చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. నిధీ అగర్వాల్ లేదా మరో హీరోయిన్ ని ఎన్టీఆర్ పక్కన ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎలాగూ సాయి పల్లవి సహా మరి కొందరు లైన్ లో ఉన్నారు. మరి ఇప్పుడు స్టార్ హీరోల పక్కన ఎవరు సినిమాలు చేస్తారు అనేది చూడాల్సి ఉంది. వాళ్ళు ఇద్దరూ రేట్లు ఎక్కువగా చెప్పడం తోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: