మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ఏ స్థాయిలో దగ్గర అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కు అక్కడి నుంచి కూడా తెలుగులో మంచి డిమాండ్ వచ్చింది గాని ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వెళ్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే దాదాపుగా చేస్తుంది అనే విషయమా అర్ధమవుతుంది. అగ్ర హీరోయిన్ గా ఆమెకు అప్పటి నుంచి గుర్తింపు వచ్చినా సరే ఆమె మాత్రం సినిమాలను చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి మాత్రమే చేస్తుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఆమెకు అసలు హీరోల పక్కన సినిమాలను చేసే ఆలోచన లేదు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. హీరోల పక్కన సినిమాలను చేయను అని సోలో గానే సినిమాలు చేస్తాను అని అంటుంది. ఇటీవల ఆమెను స్కిన్ షో కొంచే౦ అయినా చెయ్యాలి అని కొందరు దర్శకులు ఇబ్బంది పెట్టారు అని సమాచారం. అందుకే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తాను అని ఆమె స్పష్టంగా చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అటు తమిళంలో కూడా ఆమె ఇదే విషయం చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్. 

 

మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా మరో హీరోతో చేసే ఛాన్స్ వచ్చినా సరే తాను చేయలేను అని ఆమె చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి నిజమా కాదా నేది చూడాలి. ఆమె ఇటీవల నటించిన పెంగ్విన్ సినిమా ఓటీటీ లో విడుదల అయింది. దీనికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల్లో ఆమె సోలో గానే నటిస్తుంది ని టాక్... చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: