బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్... జాన్వీ కపూర్. తల్లి నిన్న‌టి త‌రం అందాల హీరోయిన్ అయిన దివంగ‌త శ్రీదేవి వారసత్వాన్ని ఆమె అందుకుందా లేదా ? అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఆమెకు అక్కడ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఆమెతో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జాన్వీ మాత్రం తండ్రి సలహాతో చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది.

 

ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఆమె న‌టిస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు జాన్వీ మహేష్ బాబు తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని సమాచారం. మహేష్ ఆమె తో సినిమా చేయడానికి గానూ ఆసక్తి చూపించాడు అని... అక్కడ ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది అని తనకు అది ఉపయోగపడే అవకాశం ఉందని మహేష్ భావించి ఆమెతో సినిమా చెయ్యాలి అని చూస్తున్నాడట. 

 

అయితే ఆమె మాత్రం ఇప్పుడు మహేష్ తో సినిమాకు డేట్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచనలో పడినట్టు టాలీవుడ్ మీడియా స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె సినిమా చేస్తుందా లేదా అనేది తెలియదు గాని ఆమెతో సినిమా చేయడానికి మహేష్ బాబు పట్టుదలగా ఉన్నాడు అనేది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వినపడుతున్న మాట. జాన్వీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: