చిరంజీవి సినిమాలు అనగానే జనాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక పిచ్చి. ఆయన సినిమా ఏ విధంగా ఉన్నా సరే చూస్తూనే ఉంటారు. ఆయన సినిమా హాల్ లో వచ్చినా టీవీ లో వచ్చినా సరే ఎక్కడ వచ్చినా సరే మిస్ అయ్యే అవకాశం దాదాపుగా ఉండదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ సినిమా తర్వాతః ఆయన రామ్ చరణ్ నిర్మాతగా ఒక పెద్ద సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. 

 

తాజాగా మరో వార్త వచ్చింది. చిరంజీవి ఇప్పుడు ఓకే టీవీ షో చేసే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం టాలీవుడ్ లో బాగా జరుగుతుంది ప్రస్తుతం. లాక్ డౌన్ లో సినీ పరిశ్రమ చాలా వరకు నష్టపోయింది అని అందుకే ఇప్పుడు స్టార్ హీరోలతో ఎక్కువగా షోస్ చెయ్యాలి అని టీవీ యాజమాన్యాలు భావిస్తున్నాయి అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఆయన మా టీవీ తో ఒప్పందం కూడా చేసుకున్నారు అని అంటున్నారు. స్టార్ మా యాజమాన్యంకు ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అని తెలుస్తుంది. 

 

ఆయన త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చెప్పడం ప్రస్తుత౦ కాస్త కష్టమే. ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా లేదు అని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: