ఈ మధ్య జనాలు ఎక్కువగా భిన్నమైన కథలను కోరుకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే చిన్న హీరోలు స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు భిన్నమైన కథలతో సినిమాలు చేయడానికి గానూ సిద్దమవుతున్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు  భిన్నమైన కథలతో సినిమాలను చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు  చిరంజీవి వంటి హీరోలు అందరూ కూడా ఇప్పుడు వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తున్నారు.  ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు లూసిఫర్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని దసరా తర్వాత మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

 

ఈ నేపధ్యంలో సినిమా కథను సిద్దం చేయమని ఆయన ఇద్దరు దర్శకులకు చెప్పారు. మలయాళం రీమేక్ కాబట్టి దానిని తెలుగుకి తగిన విధంగా మార్చాలి అని సూచనలు చేసారు ఆయన. ఏ విధంగా ఆకత ఉండాలి అనే దాని మీద ఆయన నుంచి సలహాలు తీసుకుని హరీష్ శంకర్ అనీల్ రావిపూడి సిద్దం చెయ్యాలి అని భావించారు. అయితే అనూహ్యంగా చిరంజీవి ఇప్పుడు దీనిని పూరి జగన్నాథ్ కి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఆయన ఈ కథను సిద్దం చెయ్యాలని మాస్ కి దగ్గరయ్యే విధంగా సినిమా ఉండాలి అని చిరంజీవి ఆయనకు చెప్పినట్టు సమాచారం. 

 

ఒకవేళ ఆయనకు కాకపోతే మాత్రం కథను వీవీ వినాయక్ లేదా కృష్ణ వంశీ కి ఇచ్చే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు అని అంటున్నారు. కథ పూర్తిగా భిన్నంగా ఉండాలి అని ఆయన చెప్పారు అని సమాచారం. అందుకోసం ఇప్పుడు వాళ్ళు బాగా కష్టపడుతున్నారట. కాగా ఆయన ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: