ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో బుల్లితెర కు చెందిన నటులు కన్ను మూస్తు న్నారు.  గత నెల బాలీవుడ్ నటులు ఇర్పాన్ ఖాన్, రిషీ కపూర్ కన్నుమూశారు.  మొన్ననే కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూశారు. తాజాగా ప్రముఖ టివి నటుడు జగేశ్ ముకాటి (47) కన్నుమూశారు.  బుల్లితెరపై తనదైన కామెడీ పంచుతూ జగేశ్ ముకాటి ఎంతో మంది అభిమానులను సంపాదించారు. శ్రీ గణేశ్, అమితా కా అమిత్ లాంటి పాపులర్ హిందీ సీరియల్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బుందిగా ఉండటంతో రీసెంట్‌గా ముంబైలోని ఓ ఆస్పత్రిలో జగేశ్‌ను చేర్చారు. 

 

జగేశ్ మృతిపై ఆర్టిస్ట్స్ ఆర్గనైజేషన్ సీఐఎన్‌టీఏఏ సంతాపం వ్యక్తం చేసింది.  అయితే ఆయన అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి తీసుక వెళ్లగా అక్కడ జగేశ్‌కు కరోనా టెస్టులు నిర్వహించారు. వాటిలో ఆయనకు నెగిటెవ్‌గా వచ్చిందని సమాచారం.  ఈ మద్య బాలీవుడ్ లో కరోనాతో పలువురు నటులు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: