చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మన తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమె సినిమాలు ఆమె నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను అని చెప్పవచ్చు. ఆమె ఏ సినిమా చేసినా సరే ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపు  మన తెలుగులో మంచి విజయం సాధించిన సినిమాలే. ఇక ఇప్పుడు ఆమె ఎక్కువగా తమిళం తో పాటుగా మలయాళం లో సినిమాలు చేస్తుంది. దాదాపు అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఆమె చేస్తుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త ఆమె గురించి హల్చల్ చేస్తుంది. పాపకు పెళ్లి చెయ్యాలి అని ఫ్యామిలీ లో ఒత్తిడి ఎక్కువగా వస్తుంది అని సమాచారం.  ఆమెను పెళ్లి చేసుకుని తర్వాతః సినిమాలు చేసుకోవాలి అని ఫ్యామిలీ పెద్దలు చెప్పారని సమాచారం. దీనితో ఇప్పుడు ఆమె సినిమాలను కొన్ని రోజులు పక్కన పెట్టి పెళ్లి చేసుకుని అప్పుడు సినిమాలను చెయ్యాలని ఆలోచన చేస్తుంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఎపీకి చెందిన రాజకీయ నాయకుడి కుమారుడ్ని ఆమె వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అని సమాచారం. మరి నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఆమె ఇప్పుడు తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఈ మూడు సినిమాలు వాయిదా పడ్డాయి. మరి ఎప్పుడు ఇవి మొదలవుతాయి అనేది చూడాలి. రానా తో ఆమె ఒక సినిమా చేస్తుంది. నాగ చైతన్య తో కూడా ఒకటి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: