టాలీవుడ్ లో ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ క్రమంగా పెరుగుతుంది. ఆయన వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు ఆయన మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు అనేది వాస్తవం. ఇక ఆయన సినిమాలు ఆయన నటనగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గాని ఇప్పుడు మాత్రం ఆయన వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక అవి అన్నీ కూడా తక్కువ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి గానూ బాలకృష్ణ ఒక టీం ని కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నారు అని సమాచారం. వారి అందరి తో ఆయన తన సోషల్ మీడియాలోనే సినిమా ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారట. పాటలను అన్నింటి ని కూడా సోషల్ మీడియాలో మాత్రమే విడుదల చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న సినిమాలే చేస్తున్నారు బాలయ్య. వాటికి అనవసరంగా భారీ బడ్జెట్ ని పెట్టాల్సిన అవసరం లేదు. ప్రచారానికి కూడా భారీగా ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అని అంటున్నారు. 

 

ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే సినిమాను ఆయన సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి బోయపాటి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది అని నిర్మాత కూడా దీనికి ఓకే చెప్పారు అని అంటున్నారు. పాటల విడుదల కోసం హడావుడి అవసరం లేదు అనే ఆలోచనలో ఆయన ఉన్నారు అని సమాచారం. మరి బాలయ్య ఏ విధంగా సోషల్ మీడియాలో సక్సెస్ అవుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: