కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కి ఇప్పుడిపుడే స్టార్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్కు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను మహేష్ బాబు ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారంట. ఒకవేళ అదే నిజమైతే హీరోగా మహేష్ బాబు ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా సర్కార్ వారి పాట. ఇటీవలే ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చిత్రయూనిట్ చేసిందన్నారు.. అప్పటినుంచే ఈ మూవీ గురించిన వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ రెమ్మ్యూనరేషన్ తాలూకు వివరాలు బయటికి వస్తున్నాయి. మహేష్ బాబును ఫైనల్ అవుట్పుట్తో మెప్పించిన పరశురామ్ 10 కోట్ల రెమ్మ్యూనరేషన్ అందుకోనున్నట్లు వింటున్నాం. అయితే తాజా సమాచారం మేరకు పరశురామ్.. తన పారితోషికాన్ని తగ్గించుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన పారితోషికాన్ని 10 కోట్ల నుంచి 7 కోట్లకు ఆయన కుదించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. తాజా పరిస్థితుల్లో నిర్మాతల బాగోగులే ముఖ్యమని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న సర్కార్ వారి పాట సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ని హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.