ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ విషయంలో, తెలంగాణాలో సినిమాల షూటింగ్ విషయంలో టాలీవుడ్ ప్రముఖులుగా ఉన్న చిరంజీవి నాగార్జున కాస్త ఎక్కువగా బాధ్యత తీసుకోవడం టాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చిరంజీవి నాగార్జున వచ్చి ఏపీ సీఎం జగన్ ని, తెలంగాణా సిఎం కేసీఆర్ ని కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. వాస్త‌వంగా చిరంజీవి, నాగార్జున చేసింది మంచిప‌నే.. దీనిని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా హ‌ర్షించాలి. అయితే ఈ క్ర‌మంలోనే ఎక్క‌డో వ‌చ్చిన చిన్న క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అనేక వివాదాల‌కు కార‌ణ‌మైంది.

 

వాళ్ళ  ఇద్దరి మీద ఇప్పుడు కొందరు పెద్దలు స్టార్ హీరోలు ఆగ్రహంగా ఉన్నారు అని అంటున్నారు. తెలంగాణా సిఎం ని కలిసిన సమయంలో కొందరు ఉన్నారు.  ఆ తర్వాత కొందరిని పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారు ప్రముఖులు. అదే ఇప్పుడు  వివాదాస్పదంగా మారింది. తెలంగాణా సిఎంని కలిసిన వాళ్ళు ఏపీ సిఎంని ఎందుకు కలవలేదు అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది. వాళ్ళు వద్దనుకున్నారా లేక వీళ్ళే వద్దన్నారా...?  అసలు కారణం ఏంటీ అనేది అర్ధం కావడం లేదు ఇప్పుడు. 

 

ఒక అగ్ర నిర్మాతను కూడా పక్కన పెట్టి ఏపీ వచ్చారు. ఇప్పుడు సదరు నిర్మాత మా నుంచి కూడా తప్పుకునే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. అదే విధంగా ఆయన కొందరు హీరోలతో ఇదే విషయాన్ని ఫోన్ చేసి మాట్లాడారు అని కూడా టాక్. ఇది రాబోయే రోజుల్లో బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: