'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే టీవీ సీరియల్తో బాలీవుడ్ హీరో సుశాంత్ తన నటనా జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 'ధోనీ' సినిమా విజయవంతంకావడంతో బాలీవుడ్లో ఒక పెద్ద స్టార్గా సుశాంత్ ఎదుగుతాడని అంతా భావించారు. కానీ, తన సినీ ప్రస్థానాన్ని ఇలా ముగిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎంతో దృడంగా ఉండాల్సిన వయసులో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమను కలవరపెడుతోంది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సుశాంత్ నటించిన 'చిచ్చోరో' సినిమా చూసి ఎంతో ఆస్వాదించానని, అపారమైన టాలెంట్ ఉన్న నటుడు అని కీర్తించారు. ఇంత మంచి భవిష్యత్ ఉన్న నటులు తమ కష్టాలు ఇతరులతో షేర్ చేసుకుంటే సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని అన్నారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, తాను విన్నది నిజం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం షాక్ కలిగిస్తోందని అన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సుశాంత్ అద్భుతమైన నటుడు అని, సుశాంత్ ఇక లేడని తెలిసి తీరని వేదన కలిగిందని పేర్కొన్నారు.
Honestly this news has left me shocked and speechless...I remember watching #SushantSinghRajput in chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor...may god give strength to his family 🙏🏻
— akshay kumar (@akshaykumar) June 14, 2020