గత నెల నుంచి బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.   గత కొంత కాలంగా సుశాంత్ ఒంటరిగా ఉంటున్నాడని.. మానసికంగా ఆందోళనలో ఉన్నారని పలువురు సన్నిహితులు అంటున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని ఇది ఎలా సంబవించిందో అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

 

ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే సుశాత్ ఆత్మహత్య చేసుకున్నట్టే వచ్చింది. తాజాగా సుశాంత్ మరణం పై బాలీవుడ్ వర్గాలు రక రకాలుగా స్పందిస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కెరీర్‌‌లో ఆశించిన స్థాయికి ఎదగలేకపోతున్నాననే బాధతో అతడు ప్రాణం తీసుకున్నాడని, బ్రేకప్ కూడా కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే అతనికి మంచి ఆఫర్లే ఉన్నాయని, మానసిక ఒత్తిడే ఈ విషాదానికి కారణమని కూడా అంటున్నారు.

 

ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కపూర్ సంచలన ఆరోపణ చేశారు. నువ్వు ఎంత బాధ అనుభవించావో నాకు తెలుసు. నిన్ను పతనం చేసిన వాళ్ల గురించి తెలుసు. నువ్వు వాళ్ల కారణంగా బాధ అనుభవిస్తూ నా భుజంపై తలపెట్టి ఏడ్చేవాడివి.. నేను ఆరు నెలల కిందట చేరుకోవాల్సి ఉండింది. మనం కలవాల్సి ఉంది..  జరిగిందంతా వాళ్ల కర్మ, నీది కాదు.. అంటూ ఆవేదనగా  ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: