‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తరువాత కరోనా సమస్యతో షూటింగ్ లకు గ్యాప్ రావడంతో మహేష్ సినిమా షూటింగ్ లకు గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పరుశు రామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రాజెక్ట్ ఓకె కావడంతో ఈమూవీకి కర్ణాటక రాష్ట్రంలో కూడ మంచి క్రేజ్ తీసుకురావడానికి పరుశు రామ్ వేసిన ఒక మాష్టర్ ప్లాన్ కు మహేష్ ఓకె చెప్పినట్లు టాక్.


ఇప్పటికే ఈమూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అన్న న్యూస్ కొందరు ప్రచారంలోకి తీసుకు వస్తుంటే మరికొందరు ఈమూవీలో మహేష్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదిచాలదు అన్నట్లుగా మహేష్ సినిమాలకు మార్కెట్ తక్కువగా ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఈమూవీ భారీ విజయం కోసం కన్నడ స్టార్ ఉపేంద్ర సహాయాన్ని కోరుతున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీలో మెయిన్ విలన్ పాత్రకు ఉపేంద్రను అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో ఉపేంద్ర నటించిన పరిస్థితులలో ఉపేంద్ర వల్ల తమ మూవీకి తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రేక్షకులలో కూడ క్రేజ్ ఏర్పడుతుందని పరుశు రామ్ మహేష్ ల వ్యూహం అని అంటున్నారు. అయితే ఆశ్చర్యంగా ఉపేంద్రమూవీ ప్రాజెక్ట్ కు వెంటనే ఓకె చెప్పకుండా హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది.


దీనితో పారితోషిక విషయంలో ఉపేంద్ర ఇలా బెట్టు చేస్తున్నాడా లేదంటే ఈమూవీలోని విలన్ పాత్ర ఉపేంద్ర కు పూర్తిగా నచ్చలేదా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమూవీలో హీరోయిన్ గా నటించే విషయంలో కియారా అద్వానీకి కూడ వేరే అభిప్రాయం ఉంది అని అంటున్నారు. మహేష్ మూవీకి తాను పరుశు రామ్ కోరిన విధంగా బల్క్ డేట్స్ ఇవ్వలేనని ఇప్పటికే కియారా చెప్పింది అని అంటున్నారు. దీనితో కరోనా భయాలు తీరి ఎప్పటికి షూటింగ్ మొదలవుతుందో పూర్తిగా పరుశు రామ్ కు కూడ తెలియని ఈమూవీ కీలక నటీనటుల ఎంపిక పరుశు రామ్ కు తలనొప్పిగా మారింది అన్నమాటలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: