క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరి కాంబినేషన్లో తెరపై రాబోతున్న సినిమా " పుష్ప" . ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.  వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కేరళ రాష్ట్రంలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ అన్ని ఆగిపోవడం జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. 

 


అలాగే చిన్న సినిమాల షూటింగులు ఇప్పటికే మొదలయ్యాయి కానీ... స్టార్ హీరోల షూటింగ్స్ మటుకు ఇంకా మొదలవలేదు. అయితే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఒక ప్లాన్ సిద్ధం చేశారని తెలుగు ఇండస్ట్రీలో టాక్. ఇక అసలు విషయానికి వస్తే... పుష్ప సినిమా షూటింగ్ కు బన్నీ సిద్ధమవుతున్నారట. ఈ సినిమా కోసం మహబూబ్ నగర్ అడవులలో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా తయారు చేస్తున్నారట. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో కూడా ఈ సినిమా కోసం మరో సెట్ కూడా వేస్తున్నారు. ఇక అక్కడ ఒక పాట చిత్రీకరణ చేస్తున్నారు. 

 


ఇక ముందుగా బన్నీ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేద్దాం అని తెలియజేశారు. అందుకోసం బన్నీ ప్లాన్ చేసిన ప్రకారం ముందుగా ఆ పాటను పూర్తి చేసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. ఇక బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాల అనంతరం మళ్లీ ఈ సినిమా మొదలు పెట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందో లేదో మరి వేచి ఉండాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: