బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశం మొత్తాన్ని కదిలించింది. అదేస్థాయిలో బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పాయింట్ ఔట్ అయ్యాడు. ఇందుకు కారణం లేకపోలేదు. కరణ్ నెపోటిజంను మాత్రమే ప్రోత్సహిస్తాడని ఆయనపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అలియా భట్, జాన్వీ, ఇషాన్.. వంటి సినీ వారసుల్ని పరిచేయం చేసాడు కానీ.. కొత్త వారంటే కరణ్ కు పడదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యతిరేకత ఆయన సోషల్ మీడియాపై ఎఫెక్ట్ పడింది.

IHG

సుశాంత్ ఆత్మహత్యకు ముందు 11మిలియన్లకు పైగా ఉన్న కరణ్ జోహార్ ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు 10.9కి పడిపోయింది. సినీ ప్రేమికులు కరణ్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇదొక ఉదాహరణ. కరణ్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమాన్ని కూడా నెటిజన్లు ఇందుకు ఉదహరిస్తున్నారు. గతంలో ఈ షోలో పాల్గొన్న అలియా భట్ ఓసారి.. రణవీర్, వరుణ్ ధావన్, సుశాంత్.. పేర్లు ఇచ్చినప్పుడు సుశాంత్ పేరు వచ్చేప్పటికి.. ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. హూ’ అనేసింది. అయితే.. ఇందుకు కరణ్ అడ్డు చెప్పకుండా నవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది కూడా. నెటిజన్లు ఇప్పుడు ఇదే ఉదహరిస్తున్నారు.

IHG

సుశాంత్ కు జరిగినవన్నీ నెటిజన్లు ఒకొక్కటిగా వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లని ఇండస్ట్రీ ఎంత చిన్నచూపుగా చూస్తుందో ఇదే ఉదాహరణ అంటున్నారు. కానీ.. ధర్మ ప్రొడక్షన్స్ చాలా మంది కొత్త నటులు, దర్శకులను పరిచయం చేసిందంటున్నాడు కరణ్. వారసుల్ని పరిచయం చేసినా టాలెంట్ గుర్తించడంలో ధర్మ ప్రొడక్షన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉందంటున్నాడు. కానీ.. ఇవేమీ నెటిజన్లను శాంతింపజేయడం లేదు. తనని తగిన విధంగా గుర్తించడం లేదనే సుశాంత్ అభిప్రాయాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: