టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు సుకుమార్. ఆయన సినిమాలు అనగానే సినిమా ఏ విధంగా ఉంటుంది అనే చర్చ టాలీవుడ్ లో సినిమా మొదలైన నాటి నుంచి కూడా ఎక్కువగానే ఉంటుంది. సినిమా మొదలైన తర్వాత దానిలో హీరో లుక్ ఏ విధంగా ఉంటుంది హీరో పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అనేక చర్చలు ఏదోక రూపంలో మీడియా లో లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలోనో ఏదోక విధంగా వస్తూనే ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే... సుకుమార్ పుష్ప సినిమా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది. 

 

సినిమాను అడవిలో షూట్ చెయ్యాల్సి ఉంటుంది కాబట్టి చిత్తూరు జిల్లాలో  ఒక గ్రామం కరోనా లేని ప్రాంతాన్ని ఎంచుకుంటాడు అన్నమాట. ఇక అక్కడికి వెళ్ళిపోయి సినిమాలో ఒక నెల రోజులకు కావాల్సిన వారిని అందరిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి తీసుకుని వెళ్లి వారు అందరిని కూడా ఇక అక్కడి నుంచి బయటకు రానీయకుండా ఉంచుతాడు. వారు అందరూ సినిమాలో వారి పాత్ర అయ్యే వరకు కూడా అక్కడే ఉంటారు.  సినిమా షూటింగ్ లో పాల్గొనే వారు అందరూ కూడా క్వారంటైన్ లో ఉండాలి ముందు. 

 

హైదరాబాద్ వచ్చి క్వారంటైన్ లో ఉండాలి లేదా ఆ గ్రామంలో క్వారంటైన్ లో ఉండాలి. క్వారంటైన్ లో ఉన్న తర్వాత మాత్రమే సినిమా షూటింగ్ ని మొదలుపెడతారు. ఇప్పుడు ఆయన సినిమాకు తీసుకుని వెళ్ళే వారు అందరిని కూడా సిద్దం చేసారు అని వాళ్ళు అందరిని కూడా క్వారంటైన్ కి వెళ్ళాలి అని స్పష్టంగా చెప్పారు అని తెలుస్తుంది. ఇక అవసరమైన తినే సరుకుల నుంచి ప్రతీ ఒక్కటి కూడా ముందే తీసుకుని వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: