బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుమించి సినీ పరిశ్రమను, నటీనటులను మరింతగా కలచివేసింది. ఈ పరిస్థితుల్లో ‘నెపోటిజం’ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వెలుబుచ్చిన అభిప్రాయాలు వైరల్ అయ్యాయి. ఇదే అంశాన్ని సినీ ప్రేక్షకులు, నెటిజన్లు ప్రస్తావిస్తూ.. సుశాంత్ పడ్డ అవమానాలను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కూడా తన వాదన వినిపించింది. ఆమె ఏకంగా తెలుగులో నెపోటిజంపై స్పందిస్తూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలపై విరుచుకుపడింది.

IHG

 

దీనిపై తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసింది. ‘కొత్త టాలెంట్ ను తొక్కేసే వాళ్లలో టాలీవుడ్ లెజెండ్స్ గా చెప్పుకునే చిరంజీవి, నాగార్జున ముందుంటారు. బాలీవుడ్ లో ఖాన్, కపూర్ ఫ్యామిలీస్ కూడా న్యూ టాలెంట్ ను తొక్కేసేవారే. కొత్త వారొస్తే తమ టాలెంట్ తో తొక్కేస్తారనే అభద్రతాభావం వీరిది’ అనే అర్ధం వచ్చేలా కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యల్లో వివాదాస్పద పదాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ నెపోటిజం వల్లే సుశాంత్ సింగ్ అభద్రతా భావంతో ఉన్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి టాలీవుడ్ పై వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి.

IHG

 

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు బాలీవుడ్ ప్రముఖులు వ్యవహరించిన తీరే కారణమంటూ ఇంకా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. సోషల్ మీడియా వేదికగా సినీ పరిశ్రమలో వారసత్వంపై తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కరణ్ జోహార్ కు కపూర్, ఖాన్ ఫ్యామిలీలు తప్ప మరెవరూ కనిపించరంటూ దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. చిరంజీవి, నాగార్జునపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: