తమ అభిమాన నటులు కన్నుమూస్తే ఎంత బాధపడతారో కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఒకప్పుడు ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకోని ప్రమాదం వల్ల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం తట్టుకోలేక ఎంతో మంది అభిమనుల గుండె ఆగి చనిపోయారు.. ఇక తమిళనాట అమ్మగా పిలవబడిన జయలలిత మరణ వార్త విన్న తర్వాత ఈ తరహాలోనే ఎంతో మంది అభిమానుల గుండె ఆగిపోయింది.  బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో అతని అభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, పట్నాలో మరో యువతికి కూడా బలవన్మరణానికి పాల్పడింది. 

 

రాజేంద్ర నగర్ ఏరియాలో మైనర్ బాలిక ఇషికా కుమారి సుశాంత్ అంటే ఎంతగానో అభిమానించేది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందో అప్పటి నుంచి ఇషికా కూడా డిప్రేషన్ లోకి వెళ్లింది.  అతని ఫోటోలు.. మరణించినపుడు తీసిన ఫోటోలు చూసి తట్టుకోలేక పోయింది.  సుశాంత్ మరణవార్తను ప్రసార మాధ్యమాల్లో పదే పదే చూసిన కుమారి మానసికంగా కుంగిపోయింది. గత రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ కోసమంటూ టెర్రస్ పైకి వెళ్లిన ఆమె తర్వాత విషణ్ణ వదనంలోకి తన గదిలోకి వెళ్లిపోయింది. పొద్దున గదిలోంచి బయటకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టారు.

 

తలుపులు ఎంత కొట్టిని.. ఫోన్ చేసిన ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి స్పందన లేకపోవంతో తలుపు బద్దలు కొట్టి లోనికెళ్లగా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. సుశాంత్ పోయాడని తెలిశాక బాధపడిందని, అయితే ప్రాణం తీసుకుంటుందని అనుకోలేకపోయామని తల్లిదండ్రులు అంటున్నారు. యూపీలోని బరేలీలో ఓ విద్యార్థి కూడా ‘సుశాంత్ మాత్రమేనా, నేను చనిపోలేనా’ అంటూ లేఖ రాసి ప్రాణం తీసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణ వార్త విన్న తర్వాత అతనికి వరుసకు వదిన అయ్యే  మహిళ కూడా గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: