నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఈమూవీకి సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక విషయంలో శ్రద్ధ పెట్టాడు. ఈమూవీ పీరియాడికల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఒక సైన్సు ఫిక్షన్ మూవీగా రూపొందబోతోంది.  సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మించడమే కాకుండా అనేక ప్రంచ భాషలలో డబ్ చేసి విడుదలచేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు.  


ఈమధ్య ఈసినిమా గురించి నాగ్ అశ్విన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది పాన్ ఇండియా సినిమా కాదని పాన్ వరల్డ్ సినిమా అని చెప్పడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర  కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్‌ ను తీసుకోవాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉండటంతో ఇప్పటికే దీపికా ఆలియా భట్‌ లను ఈసినిమా కోసం సంప్రదించారు.


ఆలియా భట్ ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో పాటు ’బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మరో రెండు మూడు సినిమాలకు ఆమె ఓకే చెప్పిన పరిస్థితులలో అలియా ఈమూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం దీపికా పదుకొణే తో సంప్రదింపులు చివరి దశకు చేరుకున్నాయి. నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో పాటు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆమె ఈసినిమాలో నటించడానికి చెప్పిన కండిషన్స్ మాత్రం ప్రభాస్ మైండ్ బ్లాంక్ చేసినట్లు టాక్.


ఈచిత్రంలో యాక్ట్ చేసినందుకు తనకు ఈసినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని కోరినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ‘బాహుబలి’ తో ప్రభాస్‌ కు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడిన రీత్యా గత సంవత్సరం విడుదలైన ‘సాహో’ కు ఫ్లాప్ టాక్ వచ్చినా ఈమూవీకి బాలీవుడ్ లో 200 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి. ఈలెక్కలను ఆధారంగా తీసుకుని దీపికా ప్రభాస్ లేటెస్ట్ మూవీ బాలీవుడ్ రైట్స్ అడిగిందని డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు మిగతా ఖర్చులు అన్నీ తీసివేసినా తనకు 70 కోట్ల వరకు తనకు మిగిలే ఛాన్స్ ఉంది అని దీపిక ప్లాన్ అని అంటున్నారు. ఇలా తన మీద భారీ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న దీపిక ఆలోచనలు తెలుసుకుని ప్రభాస్ మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: