టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మ‌హేష్ బాబుతో చేసిన భ‌ర‌త్ అనే నేను సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. నాలుగు వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న కొర‌టాల శివ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త యేడాది కాలంలో మీడియాలో నానుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప‌లు మార్లు వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. తాజా గా క‌రోనా నేప‌థ్యంలో మ‌రోసారి షూటింగ్ వాయిదా వేశారు.

 

ఇక కొర‌టాల‌కు ఇది ఐదో సినిమా. ఆయ‌న గ‌త నాలుగు సినిమాల‌కు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించినా ఆచార్య సినిమాకు మణిశర్మతో పనిచేస్తున్నాడు కొరటాల శివ. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగి పోయింద‌ని.. కొర‌టాల దేవీని ప‌క్క‌న పెట్టేశార‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా స్టార్ట్ అయ్యింది. అయితే ఇదంతా అవాస్త‌వ‌మే అట‌. ఈ సినిమాకు దేవితో పనిచేయక పోయినా కొరటాల, దేవి మధ్య సఖ్యత చెడిపోలేదని తెలుస్తోంది.

 

వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం అలాగే ఉంద‌ని.. కొన్ని కార‌ణాల‌తో పాటు చిరు రిక‌మెండేష‌న్ మేర‌కే కొర‌టాల ఈ సినిమా కోసం మ‌ణిశ‌ర్మ‌ను తీసుకున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. ఈ సినిమా త‌ర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టికి క్లారిటీ లేదు . ముందుగా త్రిష పేరు ప‌రిశీలించారు .ఆ త‌ర్వాత ఆమె త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు మ‌రో హీరోయిన్ కోసం అన్వేష‌ణ‌లో ఉన్నారు. కంటిన్యూ గా షూటింగ్ కంప్లీట్ చేసి వ‌చ్చే సంక్రాంతికి రీలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: