కరోనా మహమ్మారి... ఈ విషయంలో డాక్టర్ నుంచి సినీ తారల వరకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ అయితే మందులు వైరస్ పేర్లు చెప్పి అవగాహన కల్పిస్తారు. మరి సినీ ప్రపంచంలో తడిసి ముద్దవుతున్నాడు ఓ దర్శకుడు ఏ విధంగా ప్రజలకు అవగాహన చేరవేయాలని ఆలోచించి ఈ వినూత్న ప్రయత్నం చేశాడు. ఆయనే సంచలన దర్శకుడు విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ క్రిష్...

 

 

క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ అద్భుతమే. సమాజానికి మేల్కొల్పడం, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలపైన ఆయన సినిమాలు ఓపెన్ సంచలనం. అలాంటి దర్శకుడు కరోనా పైన వేమన శతకం రాశాడు...

 

చేతిలోన గ్లోవు చెవిపైకి ఒక మాస్క్ 
చెంతనెపుడు మంచి శానిటైజర్
ఉండినంతగాని బయటకు పోరాదు
విశ్వదాభిరామ వినురవేమ" అంటూ సాగుతున్న ఈ పద్యం ఆకట్టుకుంటోంది.

 


క్రిష్ ఆలోచనలు ఎప్పుడు విభిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులను ఎప్పుడు ఆకర్షిస్తాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది ఒక పౌరాణిక చిత్రం అని చిత్ర సీమ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ విధించడం వలన ఈ సినిమా పట్టాలెక్కి ఎందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ కాంబినేషన్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ రాసిన ఈ వేమన శతకం వైరల్ గా మారింది. దీనిని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం వీక్షించి ఈ విలక్షణ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. క్రిష్ రుద్రమదేవి సినిమా తో మరో మెట్టెక్కింది. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాతో శిఖరాలను అందుకుంటారని చిత్రసీమలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: