జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. అజ్ఞాత‌వాసి సినిమా ఘోరంగా డిజాస్ట‌ర్ అయ్యింది.  ఆ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో అన్ని స్థానాల్లో క‌మ్యూనిస్టుల‌తో కలిసి ప‌వ‌న్ పోటీకి దిగారు. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోరంగా ఓడిపోయింది. ప‌వ‌న్ సైతం భీమ‌వ‌రం, గాజువాక రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా కూడా ఘోరంగా ఓడిపోయారు. 

 

దీంతో ప‌వ‌న్ మళ్లీ సినిమాల బాట ప‌ట్టాడు. ఈ క్ర‌మంలోనే హిందీలో హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు వ‌కీల్ సాబ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ సెట్ కాలేదు.

 

వెతికి వెతికి చివ‌ర‌కు శృతీ హాస‌న్‌ను హీరోయిన్ గా సెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఫేడ‌వుట్ అయిన శృతీహాస‌న్‌కు ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ రావ‌డ‌మే గొప్ప‌. అలాంటిది ఈ సినిమాలో న‌టించ‌మ‌ని అడిగితే శృతి నో చెప్పింద‌ట‌. దీంతో సినిమా య‌నిట్ పెద్ద షాక్ అవుతున్న‌ట్టు టాక్‌. అస‌లే చాన్సులు లేని ఆమెకు ప‌వ‌న్ ప‌క్క‌న ఛాన్స్ ఇస్తే నో చెపుతుందా ?  అని వాళ్లు మండి ప‌డుతున్నార‌ట‌.  

మరింత సమాచారం తెలుసుకోండి: