టాలీవుడ్ లో గత రెండు నెలల నుంచి ఎక్కువగా విజయ నిర్మల  బయోపిక్ గురించి  పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విజయ నిర్మల బయోపిక్ లో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ లో ఎక్కువగానే వస్తున్నాయి. ఆమె నటిస్తుందని విజయ్ నిర్మల కుమారుడు నరేష్ ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది అని జనాలు అంటున్నారు. అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. 

 

ఇక ఇప్పుడు ఈ సినిమాలో కృష్ణ పాత్రకు గానూ మరో నటుడ్ని ఎంపిక చేసారు అని తెలుస్తుంది. కృష్ణ పాత్రకు గానూ ముందు తెలుగు నటుడ్ని తీసుకోవాలి అని చూసినా సరే ఇప్పుడు మాత్రం దుల్కర్ సల్మాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అతను అయితే ఆ పాత్రకు సరిగా సరిపోయే అవకాశం ఉంది అని భావిస్తున్నారు జనాలు. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా మహేష్  బాబు కూడా ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. 

 

మరి చేస్తారా లేదా అసలు ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు అనేక చర్చలు అయితే నడుస్తున్నాయి. ఈ సినిమాలో కొందరు నటుల ఎంపిక జరుగుతుంది అని సమాచారం. చూడాలి మరి ఎవరిని ఎంపిక చేస్తారు ఏయే పాత్రలకు ఎవరిని తీసుకుంటారు అనేది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు కీర్తి తెలుగులో రెండు సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: