టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మినహా పెద్దగా మరో మార్గం అనేది లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక చిన్న హీరోలు పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా దాని మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు దర్శకులు ఓటీటీ ని దృష్టి లో పెట్టుకుని సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నారు. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయడం చాలా సులువు. అయితే అందుకు తగిన విధంగా బడ్జెట్లో సినిమాలు ప్లాన్ చేసుకోవాలి.
ఓటీటీ లో సినిమాలను విడుదల చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని సమాచారం. ఆయన ఓటీటీ సంస్థలతో ముందే ఒప్పందం చేసుకుని థియేటర్ తో పాటుగా అందులో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమాను అదే విధంగా ప్లాన్ చేసాడు అని సమాచారం.
విజయ్ కూడా ఈ విషయంలో పూరికి ఓకే చెప్పాడు అని.. మరో నిర్మాతగా ఉన్న కరణ్ జోహార్ కూడా అందుకు అంగీకారం తెలిపారు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఒక్క పూరి మాత్రమే కాదు... టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు సైతం ఇప్పుడు తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసి ఓటీటీ మార్కెట్ కూడా పెంచుకునే ప్లాన్లో ఉన్నారట. మరి ఈ వ్యూహం ఎలా సక్సెస్ అవుతుందో ? చూడాలి.