మెగా బ్రదర్ గా మెగా అభిమానులతో అభిమానంగా పిలిపించుకునే నాగబాబు నిర్మాతగా నటుడిగా కన్నా ‘జబర్దస్త్’ షో జడ్జి గా బాగా పాపులర్ అయ్యాడు. వాస్తవానికి నాగబాబు ఆర్ధిక కష్టాలు అన్నీ ‘జబర్దస్త్’’ షో తీర్చింది అంటారు. అయితే ఈ షో నిర్వాహకులు మల్లెమాల సంస్థతో వచ్చిన అభిప్రాయ భేదాలతో జీ టీవీ లో ‘అదిరింది’ షోకి నాగ బాబు షిఫ్ట్ అయ్యాడు.


అయితే ఈషో పెద్దగా సక్సెస్స్ కాకపోవడంతో ఆ షోని ఏదో విధంగా సక్సస్స్ చేయాలి అని నాగబాబు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో కరోనా సమస్యలు రావడంతో షూటింగ్ లు ఆగిపోయిన ఈషో మళ్ళీ త్వరలో బుల్లి తెర పై ప్రసారం కాబోతోంది. ఇలాంటి పరిస్థితులలో నాగబాబు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. 


‘జబర్దస్త్’ ‘అదిరింది’ షోల మాదిరిగా నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో ఫన్ అండ్ కామెడీ షో ను స్టార్ట్ చేయబోతున్నాడు అని ఆప్రకటన ద్వారా తెలుస్తోంది. కామెడీ నటులు కామెడీ రైటర్లు కావాలని ఈ ప్రకటన ద్వారా నాగబాబు పిలుపు ఇచ్చాడు. ప్రస్తుతం నాగబాబు యూట్యూబ్ ఛానల్ కు మూడు లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తనకు సమయం కుదిరినప్పుడల్లా పొలిటికల్ కామెంట్లతో నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా  ఏదో ఒక సంచలనానికి కారణం అవుతూనే ఉన్నాడు. 


ఇలాంటి పరిస్థితుల మధ్య నాగబాబు ‘అదిరింది’ షోను చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వేరుగా ఈ ఫన్ అండ్ కామెడీ షో చేయబోతున్నాడా లేకుంటే ‘అదిరింది’ షోకి కూడ నాగబాబు త్వరలో గుడ్ బై చెపుతాడా అంటూకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  మెగా కాంపౌండ్ సన్నిహితులు మాత్రేం నాగబాబు ‘అదిరింది’ షోలో కొనసాగుతూనే మరికొన్ని కామెడీ షోలు తన యూట్యూబ్ ఛానల్ లో ప్రెజెంట్ చేస్తాడు అని లీకులు ఇస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: