ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఓ డియర్, రాధేశ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ నిరంతరం అవంతరాలే ఎదురువుతున్నాయి. ఏ షెడ్యూల్ కూడా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. అప్పట్లో యూరప్‌ కు వెళ్లి తిరిగి వచ్చారు. ఇక్కడ లోకల్ ‌లో సెట్స్ వేసి షూట్ చేద్దామంటే అది కాస్తా ఆలస్యమైంది. ఇలా ప్రతీసారి ఏదో అడ్డంకి ఏర్పడుతూనే ఉందంటున్నారు.

 

 

అయితే కరోనా ఎంతగా విజృంభించినా.. ఈసారి మాత్రం చిత్రయూనిట్ మాత్రం వెనుకడుగు వేయలేదు. యూరప్ షెడ్యూల్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభాస్, పూజా హెగ్డేల మీద అదిరిపోయే సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ దర్శకుడు సోషల్ మీడియా ద్వారా సందేశం పంపినట్లు సమాచారం.

 

 

ప్రభాస్‌ కథానాయకుడిగా కె.కె. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతోంది. గోపీకృష్ణమూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న  ఈ సినిమాకు ‘రాధేశ్యామ్‌' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 22న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

1970 యూరప్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో  హస్తసాముద్రికుడిగా ప్రభాస్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చిత్రబృందం జార్జియాలో ప్రభాస్‌, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించింది. కరోనా ప్రభావంతో విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్‌లోనే ప్రత్యేకమైన సెట్స్‌లో మిగిలిన సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: