రామ్ చరణ్ భార్య ఉపాసనకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనేక సామాజిక సమస్యల పై అనునిత్యం స్పందిస్తూ ఉపాసన కు   సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చరణ్ ఉపాసనలు పెళ్లి అయి 8 సంవత్సరాలు గడిచి పోయినా ఇంకా  వారిద్దరూ నవ దంపతులుల కనిపిస్తూ టాలీవుడ్ ఛార్మింగ్ యంగ్  కపుల్ గా కొనసాగుతున్నారు.


గత సంవత్సరం చరణ్ తమ ఏడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య ఉపాసనకు ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారో తెలిసిందే. రామ్ చరణ్  ఉపాసనలు గత ఏడాది తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో టైమ్ స్పెండ్ చేయడమే కాకుండా ఆ ట్రిప్ ఫోటోలను తన అభిమానులకు కూడ షేర్ చేసి తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. 


అయితే ఈ ఏడాది జూన్ 14 న చరణ్ ఉపాసనలు తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం చాల నిరాశగా జరుపుకున్నారట. దీనికికారణం   తమకు 2020 బ్యాడ్ ఇయర్ అని తమ ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్లను పోగొట్టుకున్నాం అని అంటోంది ఉపాసన. అంతేకాదు కరోనా విలయం కూడ ఉపాసన చరణ్ ల మూడ్ ను పాడుచేసిందట. అందుకే వేడుకగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోలేకపోయాం అని అంటోంది ఉపాసన.

 

వేడుక జరుపుకోకపోయినా ఆరోజు ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ మూడు రకాల ఆవకాయ పచ్చళ్లతో అన్నం చిప్స్ మాత్రమే తిన్నామని  ఉపాసన చెపుతోంది. ఈ కొద్ది కాలంలో జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నామని చెపుతున్న ఉపాసన ఆరోజు తాము ఎలాగడిపామో తెలియచేస్తూ షేర్ చేసిన ఫోటోలో అన్నం చిప్స్ ఫోన్ టీవీ రిమోట్ సహాకొన్ని జంతువుల ఫోటోలు ఉన్నాయి. ``ఫొటోలోని ఒక్కో వస్తువు తమ ఇంట ఉన్న ఒక్కో కొత్త విషయాన్ని వెల్లడిస్తాయి``అంటూ భావోద్వేగానికి లోనవుతున్న ఉపాసన ఆవేదనలో ఎన్నో సమాదానం  లేని ప్రశ్నలు ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: