సోషల్ మీడియా విషయంలో ఇప్పుడు సినీ పెద్దలు అందరూ కూడా చాలా వరకు ఫోకస్ చేసారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ అనగానే చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనే విషయం అందరికి కూడా ఒక అవగాహన అనేది ఉంది. సోషల్ మీడియా లో సినిమా మొదలైన నాటి నుంచి విడుదల అయ్యే వరకు కూడా దాని పై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోలు కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే మెగా హీరోలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. 

 

మెగా హీరోలు అందరూ కూడా సోషల్ మీడియాకు సంబంధించి ఒక టీం ని పెట్టుకోవాలి అని నిర్ణయానికి వచ్చారట. ఒక పది మందితో టీం ని పెట్టుకుని ప్రచారం చేయించుకోవాలి అని భావిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే ఆగాలి కొన్ని రోజుల పాటు. దానికి కారణం సినిమా ప్రచార౦ సమయంలో నిర్మాత మీద భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే నిర్మాతల కు భారం కాకుండా ఉండే విధంగా సినిమాలు చెయ్యాలి అని మెగా హీరోలకు చిరంజీవి స్పష్టంగా చెప్పారట. 

 

అనవసరంగా వారి మీద భారం వేయకుండా ఉండటం మంచిది అనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారట. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి గానూ ఒక టీం ని పెట్టుకునే అవకాశం ఉంది అని దానికి గానూ బడ్జెట్ ని కూడా ప్రతీ నేలా పక్కన పెట్టి జీతాలు ఇవ్వాలి అని సూచనలు చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: