కొన్ని రోజులుగా ప్రముఖ హీరోలు నిర్మాతలుగా వహిస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ స్టార్ నాగార్జున కూడా చాలా సంవత్సరాల నుంచి నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు కూడా సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు.  ఇక ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ లాంటి బడా హీరోలు కూడా నిర్మాతలుగా వహిస్తూ సినిమాలు తీస్తున్నారు. 

 

 

ఇక మహేష్ ఇప్పటివరకు నిర్మాతగా వహిస్తున్న సినిమాలో అన్నిటికీ కూడా హీరోగా చేశాడు. ఎప్పుడు బయట హీరోలతో సినిమాలు నిర్వహించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం హీరోలతో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వహిస్తున్నారు. అయితే మహేష్ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన కూడా అందుకు సంబంధించిన వ్యవహారాలను కూడా తన భార్య నమ్రత చూసుకుంటుంది అని తెలియజేశాడు. ఇక మేజర్ సినిమా తర్వాత బయట హీరోలతో కలిసి సినిమాలు తీసేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడు. 

 

 


ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా నిర్మించేందుకు సన్నాహాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక అలాగే మహేష్ స్నేహితుడు హీరో కార్తీతో కలిసి ఒక సినిమా కూడా నిర్మించడానికి మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు లిస్టులో శర్వానంద్ కూడా చేరిపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.  ఇటీవల మహేష్ బాబు ఒక కథ విని ఆ కథకు శర్వానంద్ హీరోగా నటిస్తే బాగుంటుందని మహేష్ భావిస్తున్నాడు. ఇక మహేష్ నిర్మాణంలో శర్వానంద్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడో లేదో అన్న విషయం పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: