ఒకప్పుడు బాలీవుడ్ లో విలన్, కామెడీ పాత్రల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు శక్తికపూర్. అప్పట్లో మన తెలుగులో స్టార్ హీరోల పక్కన విలన్, కామెడీ పాత్రలో గిరిబాబు ఎలా నటించేవారో.. బాలీవుడ్ లో శక్తి కపూర్ అలా నటించారు. అందరు హీరోలతో నటించిన ఆయన ప్రస్తుతం తక్కువగా నటిస్తున్నారు. ఆయన కూతురు శ్రద్దా కపూర్ ఆ మద్య ప్రభాస్ నటించిన ‘సాహెూ’ చిత్రంలో నటించింది. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ నటుడు.. తెలుగు లో పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకన్నారు.

 

లాక్‌డౌన్‌ ప్రభావంతో ముంబైతోపాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సురక్షితంగా ఇంటికి పంపించిన సోనూసూద్‌కు తాను వీరాభిమానిని అని శక్తికపూర్‌ అన్నారు. ఎలాంటి రాజకీయ అవసరాలతో సంబంధం లేకుండా గొప్ప మనసుతో సోనూసూద్‌ ఇలాంటి పనిచేశారు. సోనూసూద్‌ ఎలాంటి ఎన్నికల్లో నిలబడటం లేదు. ఈ సందర్భంగా శక్తికపూర్‌ నటుడు సోనూసూద్‌పై ప్రశంసలు కురిపించారు. అతడేం చేస్తున్నా..మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాడు. అతడు సాధారణంగా కనిపించే కుటుంబసభ్యుడు.

 

సుమారు 30వేల మందికిపైగా వలస కార్మికులను వారి ఇంటికి పంపించాడు. ప్రభుత్వం కూడా సోనూసూద్‌ వెంట ఉంది. మంచి పనిచేస్తున్న సోనూసూద్‌కు హ్యాట్సాప్‌‌ అని అన్నారు. ఆయన్ని అభిమానించే నటుల్లో నేను ఒకరిని అని.. ఇలాంటి మంచి పనుల వల్ల ఆత్మ సంతృప్తి పొందడమే కాదు... ఎంతో మందికి లబ్ది చేకూరుతుందని.. జనాలే కదా ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: