ఇండియా టాప్ సెలెబ్రెటీ హోదాకు ఎదిగిపోయిన రాజమౌళి నుండి టాప్ డైరెక్టర్స్ కొరటాల త్రివిక్రమ్ ల వరకు కరోనా ధాటికి తట్టుకోలేక అత్యంత భారీ సినిమాలు తమ చేతిలో ఉన్నా ఆసినిమాల షూటింగ్ లను కొనసాగించలేక ఏమిచేయలేక మౌనంగా పరిస్థితులతో రాజీ పడిపోతున్నారు. అయితే అనీల్ రావిపూడికి మాత్రం ప్రస్తుతం కరోనా సమస్యతో షూటింగ్ లు క్యాన్సిల్ కావడం ఊహించని అదృష్టంగా మారింది.


‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ సక్సస్ తరువాత అనీల్ రావిపూడి తన డ్రీమ్ మూవీ ప్రాజెక్ట్ ‘ఎఫ్ 3’ ని ఈ సంవత్సరమే మొదలుపెట్టి చాల ధైర్యంగా పూర్తి చేయాలి అనుకున్నాడు. అయితే కరోనా సమస్యలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇప్పట్లో ఏకొత్త సినిమా షూటింగ్ లు మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.


దీనితో అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ ప్రాజెక్ట్ కూడ ఆగిపోయి ఈ ఏడాది చివరివరకు అందరిలాగే ఖాళీగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఈఖాళీ గ్యాప్ అనీల్ రావిపూడికి కోట్లు కురిపించబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు అనీల్ రావిపూడి ‘ఆహా’ ఒటీటీ సంస్థ కోసం ఒక వెబ్ సిరీస్ దర్శకత్వం చేయడానికి ప్రస్తుతం చాల వేగంగా స్క్రిప్ట్ పనులు చేస్తున్నట్లు టాక్.


ఒకనాటి జంధ్యాల సినిమాలులా టోటల్ కామెడీ కథనంతో నడిచే ఈ వెబ్ సిరీస్ ను ఆహా కోసం అనీల్ రావిపూడి చాల భారీ ప్రాజెక్ట్ గా మారుస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఒటీటీ ల క్రేజ్ పెరుగుతున్న పరిస్థితులలో ఆహా ను నిలబెట్టే విధంగా అనీల్ రావిపూడి తీయబోతున్న ఈ వెబ్ సిరీస్ కు అల్లు అరవింద్ అనీల్ రావిపూడికి భారీ పారితోషికం ఇస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. దీనితో షూటింగ్ లు జరగక టాప్ దర్శకులు అందరు ఇబ్బంది పడుతుంటే  ఈ గ్యాప్ ను అనీల్ రావిపూడి చాలతెలివిగా ఉపయోగించుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: