టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ ల కొరత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. తక్కువ రేట్ కి ఎవరు చేస్తే వారిని ఎంపిక చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అగ్ర హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా సరే వారి విషయంలో ఇప్పుడు ధరను ముందు పెట్టుకుని ఆలోచన చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎక్కువగా డిమాండ్ చేసింది అంటే మాత్రం ఆమె అవసరం లేదు కొత్త వారిని తీసుకోవడం మంచిది అనే భావన లో ఇప్పుడు జనాలు ఉన్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అవకాశాలు లేని అందమైన హీరోయిన్ లు అందరూ కూడా భారీగా ధరను తగ్గించుకుని సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అనే ప్రచారం బాగా జరుగుతుంది. అందులో శాలిని పాండే ప్రణీత ఉన్నారు అని టాక్. అవును ఇప్పుడు వారు ఇద్దరికీ కూడా అవకాశాలు దాదాపుగా రావడం లేదు అనే సంగతి తెలిసిందే. అందుకే వారు ఇద్దరూ కూడా చాలా వరకు జాగ్రతగా సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు. శాలిని పాండే అయితే 50 లక్షల లోపే చెప్తుంది అని సమాచారం. 

 

స్టార్ ఇమేజ్ ఉన్న ప్రణీత అయితే అదే విధంగా చాలా వరకు తక్కువకే సినిమాలు చేస్తాను అని చెప్పడం తో దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు వారి తో పాటు గా మరి కొందరు హీరోయిన్ లు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు అని టాక్. ఇప్పుడు దాదాపుగా మన తెలుగు లో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా ఇలాగే ఉన్నారు అని పూజ హెగ్డే రష్మిక మంధన మాత్రం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: