నటుడు రాజా రవీంద్ర సీనియర్ యాక్టర్ మంచి నటుడుగా పేరు వచ్చినా అతడి సమర్థతకు స్థాయిలో రాణించ లేకపోయాడు అని కొందరు అంటారు. రాజ్ తరుణ్ లాంటి కొందరు యంగ్ హీరోలకు గాడ్ ఫాదర్ లా రాజా రవీంద్రకు కొందరి యంగ్ హీరోల పై మంచి పట్టు ఉంది అన్న ప్రచారం ఉంది.


ప్రస్తుతం షూటింగ్ లు మొదలుపెట్టాలి అని ప్రయత్నించినా కరోనా సమస్యలు తీవ్రతరం అవ్వడంతో ఏమీచేయలేక నిశ్చేతనంగా ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు రాజా రవీంద్ర లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ప్రకటన చూసి షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా ధియేటర్లు ఓపెన్ అవ్వకపోవడంతో జనం అంతా కేవలం ఒటీటీ లపై విడుదల అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ చూస్తూ కాలం గడుపుతున్నారు.


ఈ పరిస్థితులలో ఈ ఒటీటీ బిజినెస్ లో ఇప్పటికే దూసుకుపోతున్న అమెజాన్ నెట్ ఫ్లిక్స్ రేంజ్ లలో తెలుగువాడి సత్తా చాటాలని అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఒటీటీ ప్లాట్ ఫామ్ పెట్టి దానిని నిలబెట్టడానికి చాల గెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కంటెంట్ విషయంలో ‘ఆహా’ బాగా వెనకపడి ఉండటంతో ఆహా ఇప్పటికీ పూర్తిగా నిలదొక్కుకోలేక పోయింది. దీనితో అరవింద్ బాగా టెన్షన్ పడుతున్నాడు అన్న వార్తలు కూడ వచ్చాయి.


ఈ విషయాలను లెక్క చేయకుండా రాజా రవీంద్ర కొత్తగా ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం ఇండస్ట్రీగా మారింది. తన ఓటిటి కి కంటెంట్ కావాలని రెడీగా కంటెంట్ ఉంటే తమని 9866661111 నెంబరుకి సంప్రదించవచ్చని ఒపెనుగా ప్రకటన ఇచ్చాడు. తాను తీయబోతున్న వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్ చివరికి షార్ట్ ఫిల్మ్ అయినా కంటెంట్ కొత్తగా ఉంటే చాలని తమని సంప్రదించవచ్చని ఈ ప్రకటన ద్వారా తెలియచేసాడు. ప్రస్తుతం రాజా రవీంద్ర సాహసం పైనే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో అరవింద్ కు అసాధ్యమైన విజయం రాజా రవీంద్ర అందుకోగలిగితే అది ఇండస్ట్రీ సంచలనమే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: