మిర్చీ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు దర్శకుడు కొరటాల శివ. ఆయనకు అవకాశాలు అక్కడి నుంచి వరుసగా వస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా అతని తో సినిమాలు చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు దాదాపుగా అతని తో ఒక్క సినిమా చేసినా సరే చాలు అనుకునే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది. అయితే ఆయన మెగా ఫ్యామిలీ తో దాదాపుగా సెటిల్ అయిపోయాడు. ఆరేళ్ళ వరకు వాళ్ళతోనే సినిమాలు చేసే అవకాశం ఉంది అని టాక్. 

 

ఇప్పుడు ఆచార్య కోసం రెండేళ్ళ నుంచి ఆయన కష్టపడుతున్నారు. ఆచార్య సినిమా కు మరో ఏడాది వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమా రామ్ చరణ్ తో ఉండే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆచార్య సినిమా దాదాపుగా సగం పూర్తి అయింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే మరో ఏడాది పట్టే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇక రెండేళ్ళ వరకు చిరంజీవి తోనే ఆయన ఉండవచ్చు అని కూడా అంటున్నారు. 

 

ఇక ఆ తర్వాత పుష్ప సినిమా రామ్ చరణ్ తో చేసే సినిమాలు రెండు మూడేళ్ళు పట్టే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో.... చూస్తే టాలీవుడ్ లో ఆయనకు మంచి డిమాండ్ ఉంది. ఇక  మహేష్ చెయ్యాలి అని చూసినా సరే అది సాధ్యం అయ్యే పరిస్థితి కనపడటం లేదు అని అంటున్నారు. దాదాపు ఆరేళ్ళ పాటు ఇక మెగా హీరోలతోనే ఉంటారట కొరటాల. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: