కరోనా కష్టాలు తారా స్థాయికి చేరుకోవడంతో విపరీతమైన గందరగోళం పెరిగిపోతోంది. ఈసారి ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించకపోయినా అనేకవ్యాపారులు తమకు తామే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుని తమ వ్యాపారాలను మూసి వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో జనం ఇంటికే పరిమితం కావలసిన పరిస్థితులు. దీనితో బుల్లితెర కార్యక్రమాలకు విపరీతంగా రేటింగ్స్ పెరిగి పోతున్నాయి.


ఈపరిస్థితులలో తమకు అనుకూలంగా మలుచుకోవాలని స్టార్ మా యాజమాన్యం ప్రయత్నాలు చేస్తూ తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 4 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ హౌస్ మేట్స్ మధ్య భౌతిక దూరం పాటిస్తూ ఈ షోను నిర్వహిస్తామని నిర్వాహకులు చెపుతున్నా సుమారు 14 మంది ఒకే ఇంటిలో అన్ని రోజులు ఈ కరోనా పరిస్థితులలో ఎలా ఉంటారు అంటూ అధికార వర్గాలు ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులకు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఎదో విధంగా వారిని మెప్పించి ‘బిగ్ బాస్ షోకు అనుమతులు తీసుకు వచ్చి ఈ షోను వీలైనంత త్వరలో ప్రారంభించాలని స్టార్ మా యాజమాన్యం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ను వేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈషో టీమ్ ఈషో హోస్ ఎంపిక గురించి మొదలుపెట్టిన ప్రయత్నాలకు అనేకమంది హీరోయిన్స్ నుండి ఊహించని స్పందన వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


గతంలో నిర్వహించిన ‘బిగ్ బాస్’ షోలకు హీరోయిన్స్ ను తీసుకురావాలి అంటే వారు పెద్దగా ఆసక్తి కనపరచక పోవడమే కాకుండా అత్యంత భారీ పారితోషికాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సినిమాల షూటింగ్ లు లేకపోవడంతో యామినీ భాస్కర్ ప్రియ వడ్లమాని హసనందిని శ్రద్దా ధాస్ మోనా లాంటి క్రేజీ బ్యూటీలు ‘బిగ్ బాస్’ సీజన్ 4 హౌస్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇంతమంది హీరోయిన్స్ బిగ్ బాస్ వైపు చూస్తూ ఉండటంతో ఈనలుగురులో ఎంతమందిబెరసార్లు ని ఫైనల్ గా ఎంపిక చేసుకోవాలి అన్నవిషయమై ఈషో నిర్వాహకులు ప్రస్తుతం వారితో బేరసారాలు మొదలేపెట్టినట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: